సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పత్రికలు, జర్నలిస్టులదే. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Published: Monday January 02, 2023
బెల్లంపల్లి జనవరి 1 ప్రజా పాలన ప్రతినిధి: సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నది పత్రికలు, అందులో పని చేసే జర్నలిస్టులదే అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
ఆదివారం స్థానిక స్టేషన్ రోడ్డు కాలనీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో "ప్రజా పాలన"   దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆయన మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికంగా జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు పత్రికల్లో జర్నలిస్టులు, నిజాలను నిర్భయంగా  రాసినప్పుడే, రాజకీయ నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గాని భయ భక్తులతో నిబంధనల ప్రకారం పని చేస్తారని, అప్పుడే సమాజం బాగుపడుతుందని అన్నారు.
 జర్నలిస్టుల చేర్యాల వల్లనే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, న్యాయబద్ధంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ ,   సక్రమమైన మార్గంలో నడిచే అవకాశం ఉంటుందని అన్నారు. పై వారందరూ భయపడుతూ, నీతి నిజాయితీలతో పని చేయడానికి ప్రయత్నించేది  పత్రికలు, అందులో పని చేసే జర్నలిస్టుల పనితనం వల్లనే అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి, సుదర్శన్, టీబీజీకేఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు ఎం, శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు గెళ్లి రాజలింగు, అశోక్ గౌడ్, నీలి కృష్ణ, గుజ్జ రవి, బిఆర్ఎస్ నాయకులు బొడ్డు నారాయణ, రమణ, శాంతిఖని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్,  ఏరియా ఆసుపత్రి కార్యదర్శి అనుముల సత్యనారాయణ, సిపిఐ నాయకులు చిప్ప నరసయ్య, తిరుపతి గౌడ్, దాగం మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.