ముద్దం ప్రకాష్ ను సన్మానించిన మాల మహానాడు జిల్లా నాయకులు
Published: Thursday February 25, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ముద్దం ప్రకాష్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ మాల మహానాడు జిల్లా నాయకులు ముద్దం ప్రకాష్ ను టి.పిసీసీ కార్యదర్శి బండ శంకర్ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బండ శంకర్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్ శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ప్రకాష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్సీ,ఎస్టీలకు జరుగుతున్న అన్యాయలను అగ్రవర్గాల పెత్తనాన్ని ఆధిపత్యాన్ని అరికడతనని ఎస్సి, ఎస్టీల వారికోసం నిరంతరం నా శాయశక్తుల పోరాడి వారికి తగిన న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్ర రాజు నీరటి గంగాధర్ నర్ర రాజేందర్ కంటే అంజయ్య కడమండ కమలాకర్ సామెల్ వసంతరావు జాన్సన్ నరేష్ సౌదామల్ల రాజం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: