ఉపాధి హామీ కూలీలకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన

Published: Friday April 23, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నాగారం గ్రామంలో గురువారం రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగత్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ కు చెందిన షీ టీమ్ బృందం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు మహిళల రక్షణపై, మహిళల భద్రతపట్ల, రోడ్డు భద్రతల పట్ల షీ టీమ్ నిర్వర్తించే విధుల గురించి, రోడ్డు భధ్రతలపై, కరోనా విజృంభిస్తున్న వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ యం కాశ గౌడ్, మైసోళ్ళ వసుమతి, కారోబార్ పావిరాల శ్రీను, బుంగ సునిల్, దుంపల స్వామిదాస్, బర్ల మారయ్య తదితరులు పాల్గొన్నారు.