ఘనంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ ల వివాహ వార్షికోత్సవ వేడుకలు

Published: Friday April 29, 2022
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 28, ప్రజాపాలన : ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైభవంగా, నిర్వహించారు. మంచిర్యాల్ లోని ఏకలవ్య ఆశ్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ప్రేమ్ సాగర్ రావు సురేఖ ల పెళ్లి రోజు వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం సమీపంలోని ఆనంద నిలయంలో వృద్ధులు అనాధ పిల్లల మధ్య వేడుకలు జరుపుకుని వారికి నిత్యావసర సరుకులను పట్టణ కాంగ్రెస్ పార్టీ అందజేసింది. తిలక్ నగర్ లోని మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తూముల నరేష్, పూదరి తిరుపతి మాట్లాడుతూ పెళ్లి రోజు వేడుకలను పర్వదినంగా జరుపుకున్నామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రేమసాగర్ రావు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల ఆదరిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో శాసనసభ్యుడిగా  ఓటర్లు గెలిపిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ వడ్డే రాజమౌళి, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ సంజీవ్, మజీద్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బాణేష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కవాడి పల్లవి తదితరులు పాల్గొన్నారు.