పార్టీ సభ్యత్వ బీమా చెక్కు పంపిణీ

Published: Friday June 18, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఎం తుర్కపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రామచంద్రయ్య రోడ్డు ప్రమాదంలో మరణించినందున టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమాద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును అతని భార్య పద్మకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి, నాయకులు ఫైళ్ల రాజ వర్ధన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యనారాయణ, పాండు తదితరులు పాల్గొన్నారు.