రామాలయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హరినాయక్

Published: Thursday January 05, 2023

జన్నారం, జనవరి 4, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో బిజెపి ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీర హరి నాయక్ రామాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మాట్లాడుతూ పలు కాలనీలో గడప గడప వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. గ్రామంలోని ప్రజలు కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రజలకు మోసం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలో వస్తుందని రాంగనే ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించి పన్న ప్రముఖులను నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ కమ్మల భూమయ్య పటేల్, బూత్ అధ్యక్షులు నాడెం సత్యం, శక్తి కేంద్ర ఇంచార్జ్ యుగేందర్, ప్రధాన కార్యదర్శి కుకటికరి శంకర్, బిజెపి నాయకులు పెరుగు మల్లికార్జున్, సాదం చిన్నయ్య, మారినేని రెడ్డి, గోల్కొండ రాజన్న, కుకటికరి కొమురయ్య, వేముల నగేష్, గ్రామ ప్రజలు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.