సీసీ రోడ్ ఎర్త్ వర్క్స్ పనులను పరిశీలన చేసిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

Published: Friday February 04, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన /న్యూస్ :శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో శ్రీరామ్ నగర్ రోడ్డు నెంబర్ 1 లో జరుగుతున్న సీసీ రోడ్డు 40 లక్షల అంచనా వ్వయ పనులను కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ స్వయంగా పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న సి.సి రోడ్డు నాణ్యవంతంగా ఉండాలని త్వరగా పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. స్థానిక ప్రజలు కాలనీవాసులు కరెంటు స్థంబాలు కావాలని ఆడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ తో మాట్లాడి కరెంటుస్తంభాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు శ్రీరామ్ నగర్ ప్రజలకు ఏ అవసరం ఉన్న వెంటనే స్పందిస్తానని హామీ ఇచ్చారు. శ్రీ రామ్ నగర్ కాలనీ అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉందని టిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని గత పాలకులు మీ కాలనీ పట్టించుకునే లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో, ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి, నర్సి రెడ్డి, క్రాంతి, రవి, వేంకటేశ్వర రావు. జీహెచ్ ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.