చెక్ అందించిన సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి

Published: Wednesday February 15, 2023
తల్లాడ, ఫిబ్రవరి 14 (ప్రజా పాలన న్యూస్): 
 మండల పరిధిలోని కుర్నవల్లి  సొసైటీ  పరిధిలో ఇటీవల అనారోగ్యంతో చెందిన ఇనపనూరి మాణిక్యం కుటుంబానికి సొసైటీ చైర్మన్  అయిలూరి ప్రదీప్ రెడ్డి మంగళవారం 50 వేల రూపాయల ఇన్సూరెన్స్  చెక్కును చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సొసైటీలో రుణము పొందిన ప్రతి సభ్యుడికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.   ప్రతి సభ్యుడికి సొసైటీ నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం  చెల్లిస్తామని తెలిపారు. సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులందరూ సకాలంలో వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. ఇప్పటికే సొసైటీ పరిధిలో నూతన సభ్యులకు రుణాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో  సెక్రటరీ  ఒగ్గు నరసింహారెడ్డి,  ఇనపనూరు పుల్లయ్య పాల్గొన్నారు