భగవన్ నామస్మరననే ముక్తిమార్గం - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Monday June 28, 2021
జగిత్యాల, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని పురానిపెటలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ సత్సంగ్ భవనాన్ని ఆదివారం రోజున ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనాటి మానవ జీవితంలో భగవంతుని ఆరాధన అనేది మానసిక ఉల్లాసానికి ఒత్తిడిని తగ్గించడానికి సహకరిస్తుందని భారతదేశంలో పురాతన కాలం నుండి భగవంతుని ఆరాధ మానవ జీవితంలో ఒక భాగమని ఉదయాన దైవస్మరణ లేనిదే మన జీవితం మొదలు కాలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విశ్వకర్మ కులసంఘ పెద్దలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ సూర్యం టివి సత్యం బెజ్జంకి లక్ష్మణ్ మెట్ట మహేందర్ అధ్యక్షుడు భాస్కరాచారి కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి రత్నయ్య భూమయ్య కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.