ఇంటికి ఆరు మొక్కలు ఇస్తున్న కార్పొరేషన్ మేయర్

Published: Friday July 09, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 25వ, 31వ డివిజన్ లో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. సాయి బాలాజీ ఫేస్ వన్, ఫేస్ టు, బాలాజీ నగర్, అదేవిధంగా  25 వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీల అధ్యక్షుల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, అలాగే ఇంటింటికి ఆరు మొక్కల ను పంపిణి చేసి, మిగతా వారికి సిబ్బంది ద్వారా అందజేయాలని సూచించారు. కాలనీవాసులు ప్రత్యేక చొరవ తీసుకొని మొక్కలు నాటాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీ ఈ అశోక్ రెడ్డి, ఏ ఈ రాంప్రసాద్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు ముత్యాల లలిత కృష్ణ, ఏనుగు రామ్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శానిటేషన్ సిబ్బంది, నగర దీపికలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.