క్రిస్మస్ వేడుకలలో పాల్గొని.. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన . తెలంగాణ రాష్ట్ర ప్
Published: Monday December 26, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంతోష్ నగర్ ఏరియాలో బేరాకా చర్చ్ లో నందు జరిగిన క్రిస్మస్ వేడుకలలో భాగంగా ప్రార్థనలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కటింగ్ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ
ముందుగా రాష్ట్ర ప్రజలకు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు., ప్రేమ భావాన్ని సేవ తత్వతరను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదిన క్రైస్తవులు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల మూలంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు, నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు.అన్ని మతాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది అన్నారు, రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ ప్రభుత్వపరంగా పండుగలను నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందిఆని వారు అన్నారు.
Share this on your social network: