రాదీవ్ స్వగృహ స్థలంలో జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు కేటాయించాలి సిపిఐ డిమాండ్

Published: Saturday May 21, 2022
కరీంనగర్,మే 20 ప్రజాపాలన ప్రతినిధి :
 

రాజీవ్ స్వగృహ భూములలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ మండల కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో కార్యకర్తలు తిమ్మా

పూర్ మండల థహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని 90 ఎకరాల రాజీవ్ స్వగృహ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం జరుగుతుంది 

కావున తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన టువంటి జర్నలిస్టులు అలాగే కరోనా సమయంలో  కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేసినటువంటి జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరిస్తూ ఆశేన్చాలమైన  సేవలు చేస్తున్నారు కావున  అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన పక్షాన తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మొగిలి పాలెం గ్రామ శాఖ కార్యదర్శి సాయిల్ల తిరుపతి పొలం పల్లి గ్రామ శాఖ కార్యదర్శి మేకల శ్రీనివాస్ నాయకులు ముత్తయ్య స్వామి గుంటి కొమురయ్య ఉప్పరపు తిరుపతి రాజు ఎల్లయ్య లు పాల్గొనడం జరిగింది