మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Published: Thursday September 01, 2022

రాయికల్, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి):
వినాయక చవితి సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి  సంవత్సరంలాగే ఈ వినాయక చవితి కూడా పంపిణి చేయడం జరిగిందని, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎదండి దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. సి.  బి.భూమయ్య, మ్యాకల  రమేశ్, కార్యదర్శి కొత్తపల్లి రంజిత్,కోశాధికారి కడకుంట్లనరేష్,లయన్స్ క్లబ్ సభ్యులు , కాటిపెల్లి రాంరెడ్డి,దాసరి గంగాధర్ ,గంప ఆనందం,కట్లనర్సయ్య, మరిపెల్లిశ్రీనివాస్, చౌడరపులక్ష్మి నారాయణ ,నిమ్మల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.