లారీని కారు ఢీకొనడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం రోడ్డుకు అడ్డంగా నిలిపిన సుబాబుల్ లారీల వల్ల

Published: Monday August 29, 2022

బోనకల్, ఆగస్టు 28 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ సమీపంలో హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద కారు లారీని ఢీకొనడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వైరా నుండి బోనకల్ మీదుగా ఖమ్మం వెళుతున్న కారు రావినూతల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనదారుడు హెచ్ పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుని రోడ్డుపై వస్తుండగా పెట్రోల్ బంకు కు ఎదురుగా వైరా జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా వరుసగా నిలిపి ఉన్న సుబాబుల్ లారీలు అటు నుండి వస్తున్న వాహనాలు కనబడకుండా నిలపడంతో పెట్రోల్ బంకు నుండి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా రోడ్డుపై రాగా వైరా నుండి వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదే వైరా నుండి వస్తున్న లారీ ముందు చక్రంలో కారు ఇరుక్కుపోయి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రోడ్డుకు అడ్డంగా నిలిపిన లారీల వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదం నుండి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా లారీలు నిలవకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.