డబుల్ బెడ్ రూం ఇళ్ల ను చుట్టుముట్టిన వరద నీరు. నీటిలో పాములు.

Published: Wednesday July 13, 2022
పాలేరు జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని రాజేశ్వరపురంలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూం
ఇళ్లను వరద నీరు చుట్టుముట్టాయి. గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఇళ్ల ను నిర్మించటం తో పై నుంచి వచ్చిన వరదంతా ఇళ్ల చుట్టు చేరింది. దీనికి తోడు ఇళ్లు నాసిరకం గా నిర్మించటంతో స్లాట్లు కురుస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇళ్లకు వరద పాటేత్తింది. లబ్దిదారులు గత నాలుగు రోజులు నుంచి నీళ్లతో నిండిన ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణంలో తెలియని స్థితిలో డబల్ బెడ్రూం వాసులు పాములు ఇతర కీటకాలు ఇళ్లలో కి వస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీటిని తొలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంల్ ప్రజాపండా నాయకులు పగిడి కత్తుల రామదాసు, వడ్లమూడి సతీష్ లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతంచేస్తామని హెచ్చరించారు.
 
 
 
Attachments area