పాఠశాల విద్యార్థినిలకు హిమోగ్లోబిన్ పరీక్షలు శంకరపట్నం మార్చి 28 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Wednesday March 29, 2023

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం  గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల బాలికలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ లో భాగంగా పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వారిదైనందిత జీవితంలో ప్రతిరోజు, మిల్లెట్ మిల్స్, చిరుధాన్యాల ఆహారం, ఆకుకూరలు, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వారికి సూచించారు. అనంతరం ఏఎన్ఎం శ్రీవాణి, ఆశ కార్యకర్త కోమల విద్యార్థినిలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి కౌమార బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించి, పలు ఆరోగ్య సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.