భారతీనగర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయం : కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
Published: Thursday March 25, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : భారతీనగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టడం జరుగుతుందని సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. హెచ్ ఐ జి కాలనీ లో ఇంజనీరింగ్ అధికారులతో పర్యటిస్తూ 1.20 కోట్ల తో చేపట్టబోయే వాటర్ బాక్స్ డ్రైన్ మ్యాప్ పరిశీలిస్తూ ఏ విధంగా వెయ్యాలో అధికారులకు సూచించారు. అదే విధంగా ఎంఐజి కాలనీ రోడ్డు సమస్య ఉందని తెలిసి అధికారులకు కాలనీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి ఇంటి లోపల నీరు పోకుండా రోడ్డు వేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఈ ఈ సత్యనారాయణ, డి ఈ శిరీష , కాలనీ జనరల్ సెక్రెటరీ అడపా రావు, వైస్ ప్రెసిడెంట్ జి రామ్మోహన్ రావు, నీలకంఠఅప్ప, ఎమ్ ఆర్ రావు, మధుసూదన్ రావు, నాగిరెడ్డి, వార్డు మెంబర్ బూన్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: