అస్సాం సిఎం హిమంత్ బిశ్వాస్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Published: Tuesday February 15, 2022
ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వాస్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ధారూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్సాం సీఎం పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. 48 గంటల్లో పోలీస్ అధికారులు స్పందించాలని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులకు సంస్కారం ఉంది కాబట్టి బీజేపీ నాయకులలాగా బరితెగించి మాట్లాడటం లేదని.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ కార్యదర్శి బుజ్జయ్య గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కల్వ కిరణ్, నాయకులు బాబాఖాన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్, నాయకులు ప్రవీణ్ రెడ్డీ, యాదయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..