నేటి జిల్లా బంద్ విజయవంతం చేయాలి. ..డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

Published: Thursday March 02, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 01, ప్రజాపాలన: 
 
గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ   గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా రైతులు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఈ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.