నిరుపేదలకు "నిత్యావసర సరుకులు" పంపిణీ

Published: Friday November 26, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మధిర సేవా సమితి ఆధ్వర్యంలో నిగర్వి, నిరాడంబరుడు, వినయశీలి, సేవాతత్పరుడు, భగవత్ ఆరాధ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పుల్లఖండం చంద్రశేఖర్ 60వ "జన్మదినం" పురస్కరించుకొని అత్యంత నిరుపేదలకు నిత్యావస సరుకులు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ మాధవరపు నాగేశ్వరావు, పుల్లఖండం సత్యనారయణ మూర్తి, పల్లపోతు ప్రసాదరావు, కొల్ల శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు కుమారుడు సందీప్, గార్లు శేఖర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అత్యంత నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసినారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడంలో శేఖర్ సేవా దృక్పథం, వారి యొక్క కోరికగా అలవాటు చేసుకుని  అండగా నిలుస్తున్నారని మరియు ఎంతోమంది అనారోగ్యంతో వ్యాధుల బారినపడి ఆర్థిక ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు, చదువుకునే విద్యార్థులకు స్కూల్లో పుస్తకాలు, ఉపకార వేతనాలు పంపిణీ చేయడంలో వారికి ఆ "దైవం" కల్పించిన దీవెనగా తెలియజేశారు శేఖర్ గారు మాట్లాడుతూ ఈ "కార్తీక మాసంలో" 60వ సం పుట్టిన రోజు పేదల మధ్య జరుపు కోవడం నాకు తృప్తి సంతోష దాయకమని తెలిపారుఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, కోమటిడి శ్రీనివాసరావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, చారుగుండ్ల లక్ష్మీనరసింహమూర్తి, యర్రా లక్ష్మణ్, జహంగీర్,nచల్లా సత్యనారాయణ, ఇరుకుళ్ళ సురేష్, కోమటి సుధాకర్, మహంకాళి వెంకట శ్రీనివాసరావు, దాచేపల్లి రాము, బసవరాజు వాసుదేవ రావు, దూపుగుంట్ల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు