తెలంగాణ బీసీ జాగృతి అద్వర్యం లో న్యాయవాదుకు సన్మానం.

Published: Friday September 17, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 16, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ లోని వెలుగు ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచ లాయర్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాదులు కోట మల్లయ్య, కర్రే లచ్చన్న, కొత్త సత్తయ్య,  చిట్ల రమేష్, రంగు మల్లేష్ లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదు లను సన్మానించడం మాకు ఎంతో తృప్తిగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీసీ న్యాయవాదులు బిసీల ఐక్య ఉద్యమంలో భాగస్వాములు కావాని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్, గందె శ్రీ తిరుపతి, కార్యదర్శి కీర్తి బిక్షపతి, కార్యనిర్వహణ కార్యదర్శి కాగితాల సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి నగునూరి లక్ష్మణ్, సలహాదారు బోయిన ఓదెలు, సల్ల విజయ్ కుమార్, నాయకులు మంచాల సదానందం, ఆరెందుల రాజేశం, వేముల కమల్ గౌడ్, ఈన్నారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.