కొత్తపల్లి గ్రామాన్ని పరిశీలించిన భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు అంజి రావణ్
Published: Friday June 04, 2021
పరిగి, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కరోనా పెరుగుతున్న తరుణంలో ఆ యొక్క గ్రామంలో 16 కరోనా కేసులు ఆక్టీవ్గా ఉండడం వలన ఆ యొక్క గ్రామ సర్పంచ్.. లింగప్పా గ్రామ అశ వర్కారుతో కలిసి భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు అంజి రావణ్.. గ్రామ పరిసరాలు పరిశీలించారు. గ్రామంలో కరోనాను నిర్మూలించేందుకు సర్పంచ్కి కొన్ని సూచనలు ఇచ్చారు. అనంతరం పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో మాట్లాడుతూ భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని గ్రామస్తులకు సూచించారు. అత్యవసర పరిస్థితిలో బయటికిి వెళితే మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని గ్రామస్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు. అంజిరావణ్, పరిగి తాలుక అంబేద్కర్ యువజన సంఘాల ఉపాధ్యక్షుడు.. జోగు భాస్కర్. బడేంపల్లి అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అంజి మరియు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు..
Share this on your social network: