కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి

Published: Monday September 26, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 25 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  107 వ జయంతి ఉత్సవ కార్యక్రమమును రాష్ట్ర పండుగగా బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యములో ఈనెల 27 (మంగళవారం)నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున, వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ భవన్ యందు ఉదయం 10:30 గంటలకు ఇట్టి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమమునకు వెనుకబడిన తరగతుల ప్రభుత్వేతర ప్రతినిధులు , దళిత , గిరిజన ప్రతినిధులు ప్రజలు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
 
 
 
Attachments area