మేడికొండ కళ్యాణికౌన్సిలర్ ఆధ్వర్యంలో లో7వ వార్డులో మొక్కల పంపిణీ

Published: Thursday July 22, 2021

మధిర, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ గారు ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా, మధిర నియోజకవర్గం మధిర మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  సారథ్యంలో పల్లెలు పట్టణం పచ్చల హారంలా మారాలన్న ధ్రుడసంకల్పంతో, మధిర మున్సిపల్ చైర్-పర్సన్ మొండితోక లత జయాకర్, మున్సిపల్ కమీషనర్ రమాదేవి నేతృత్వంలో 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మొక్కలను మంచిగా పెంచుకొని ప్రతి ఒక్కరూ హరిత సంరక్షకులుగా మారాలన్నారు. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు మేడికొండ కిరణ్, బజ్జీల శ్రీను తదితరులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.