*సుశీల జూనియర్ కళాశాలలను సందర్శించిన జిల్లా డిఐఈఓ*
Published: Saturday December 17, 2022
మధిర డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) పట్టణంలోని సుశీల జూనియర్ కళాశాలను శుక్రవారం జిల్లా జూనియర్ కళాశాలల అధికారి (డిఐఈఓ) రవిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు 100 శాతం సిలబస్ పూర్తి చేసి ప్రాక్టికల్స్ నిర్వహించాలని, ఓకేషనల్ విద్యార్థులకు ఓజేటి నిర్వహించాలన్నారు. అదేవిధంగా కళాశాలలో కౌన్సెలర్లని ఏర్పాటు చేసి విద్యార్థులకు మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఏఓ హరినాద్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: