గొర్రెల మందపై కుక్కల దాడి లో 12 గోర్లు మృత్యువాత

Published: Tuesday December 14, 2021
కోరుట్ల,డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలంలోని జోగన్ పల్లి గ్రామంలో ఆదివారం రోజున రాత్రి సమయంలో జోగన్ పల్లి గ్రామనికి చెందిన పంచతి మల్లయ్య గొర్ల దొండిలో వున్న గొర్ల మందపై కుక్కలు దాడి చేశాయి. దాడిలో 12 గోర్లు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు 80 వేల రూపాయలు నష్టం జరిగిందని మల్లయ్య వాపోయాడు. ప్రభుత్వo ఆదుకోవాలని పంచతి మల్లయ్య వేడుకున్నారు.