మధిరలో మాజీ ముఖ్యమంత్రివర్యులు రోశయ్య ప్రధమ వర్ధంతి మధిర రూరల్ డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతిని

Published: Monday December 05, 2022
శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు కళ్యాణ మండప అధ్యక్షులు కురువెళ్ల కృష్ణ  ఆధ్వర్యంలో రాజకీయ దురంధరుడు, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, 14 సార్లు ఆర్థిక మంత్రి చేసిన వ్యక్తిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా చేసిన కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య  ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రోశయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో అభివృద్ధి అనేక శాఖ అభివృద్ధిలో తీసుకొచ్చి మంచిగా మారుపేరు లాగా అనేకమంది నాయకుల మందను పొందిన వ్యక్తిని అనేక మంది ముఖ్యమంత్రి ఉన్న  ఆర్థిక శాఖ మంత్రి తనకి ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తూ ప్రజలను మనుషులు ఉన్న వ్యక్తిని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండప సభ్యులు మరియు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు (సూరి), ఇరుకుల్ల లక్ష్మీనరసింహారావు, పసుమర్తి రామ్మోహన్రావు,  పుల్ల ఖండం చంద్రశేఖర్, గుండెల ముత్తయ్య, పసుమర్తి సీతారాములు, పసుమర్తి కోటేశ్వరరావు, సముద్రాల పాపారావు,భవిరిశెట్టి సీతారాములు, ఏలూరి నాగేశ్వరరావు, ఇరుకుల్ల నాగేశ్వరరావు , దూపు కుంట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు*