అభివృద్ధి పనుల పై మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధికారులతో సమావేశం

Published: Wednesday February 24, 2021
మేడిపల్లి, ఫిబ్రవరి23 (ప్రజాపాలన ప్రతినిధి): అభివృద్ధి పనుల పై పీర్జాదిగూడ పట్టణ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్స్ లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లలో ఉన్న సమస్యలు వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల శుభ్రత, త్రాగు నీరు, రోడ్లు, మొదలగు వాటి గురించి వార్డుల వారిగా సమీక్షించారు. వార్డులలో  జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.