సమ్మె లో భాగంగా డా.బి.ఆర్ అంబేద్కర్ కీ వినతి పత్రం సర్పించిన గ్రామ రెవెన్యూ సహాయకులు

Published: Friday August 05, 2022

కోరుట్ల, ఆగస్టు 04 (ప్రజాపాలన ప్రతినిధి):

గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యాచరణ కమిటీ,కోరుట్ల డివిజన్ విఆర్ఎలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం 11వ రోజు నిరవేదిక సమ్మె నిర్వహించారు. సమ్మెలో భాగంగా 11వ రోజు రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు కోరుట్ల డివిజన్ వి.ఆర్.ఏ లు డా.బి.ఆర్ అంబేద్కర్ కీ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విఆర్ఏ తమ పే స్కేల్ మరియు తదితర డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల డివిజన్ విఆర్ఏ జేఏసి చైర్మన్ గొడిసెల గంగాధర్, కో చైర్మన్ కనక లక్ష్మణ్,జిల్లా కో కన్వీనర్లు చింతల వీరయ్య, బినవేని మురళి, సువర్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి రొడ్డ పోచయ్య,మసాడపు మహేష్, తొగరి శేకర్, బైరి సుధీర్ కుమార్,సంపత్ కుమార్, నహేదా బాను, హరీష ,స్వప్న,శ్యామ్ కుమార్, క్రాంతి,డప్పు గంగాధర్, సంజయ్, నరేందర్ మరియు కోరుట్ల డివిజన్ లోని మూడు మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.