గోరిగే మల్లేష్ తనయుడు రిసెప్షన్ లో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జడ

Published: Wednesday March 01, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి)
రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శి గొరిగే మల్లేష్ కురుమ, గోరిగే నాగమణి తనయుడు జస్వంత్ కురుమ రిసెప్షన్ వేడుకలు ఉప్పల్ డిపో బాలాజీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు.     ఈ రిసెప్షన్ వేడుకలో  హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై నూతన వధూవరులు జస్వంత్ కురుమ, దీప్తి ఆకాంక్షలను ఆశీర్వదించారు. గోరిగే మల్లేష్ తనయుడు జస్వంత్ కురుమ విందు కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు జస్టిస్ కే శరత్, జస్టిస్ జె శ్రీనివాస్ రావు, తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్, రైల్వే బోర్డ్ మెంబర్ గొరిగే కృష్ణలతోపాటు జడ్జిలు, న్యాయమూర్తులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు