రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయండి సీపీఐ నాయకులు మద్దోజు శ్రావణ్ కుమార్*

Published: Tuesday December 06, 2022
తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజా పాలన న్యూస్): 
      తల్లాడ మండల కేంద్రంలో తమ్మారపు వెంకటేశ్వర్లు గృహంలో మండల కార్యదర్శి ఓర్సు రమేష్ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సమితి సభ్యులు మద్దోజు శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 7 న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి గవర్నర్ వ్యవస్థ కు వ్యతిరేకంగా  రాజ్ భవన్ ముట్టడి పిలుపుమేరకు జిల్లా సమితి పిలుపుమేరకు గవర్నర్ చేస్తున్నటువంటి విధి విధానాల మీద గవర్నర్ ఒక ఆర్ఎస్ఎస్ తొత్తు లాగా ఆర్ఎస్ఎస్ ని రాష్ట్రంలో బలపరిచేలాగా రాష్ట్రంలో కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఈ గవర్నర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని చెప్పి జిల్లా రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపుమేరకు తల్లాడ మండలంలో ప్రజలను చైతన్యం చేసి 7న జరగబోయే రాజభవన్ ముట్టడికి వందలాదిగా తరలి వెళ్లడానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు నల్లమోతు నరసింహారావు,  మండల నాయకులు తమ్మారపు వెంకటేశ్వర్లు, నాగమణి రాయప్ప, రాంబాబు పాల్గొన్నారు.