కొంచెం కృష్ణ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

Published: Thursday July 08, 2021

మధిర, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ జిల్లా బిజెపి పార్టీ కార్యవర్గ సభ్యులు కొంచెం కృష్ణ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటడంసేవాహీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మధిర 16 వార్డు నందు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంచం కృష్ణారావు బిజెపి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుంచం మల్లేశ్వరి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్లు, అరటిపళ్ళు అందజేసి వేడుకలను నిర్వహించి ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పించారు