సీఎం సహాయనిది మంజూరైన చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

Published: Friday July 30, 2021

జగిత్యాల,జులై 29 (ప్రజాపాలన ప్రతినిధి): రూరల్ మండల తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కి సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 3,50,000 రూపాయల విలువగల చెక్కును చలిగల్ రైతు వేదికలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంత అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, మండల రైతు బంధు కన్వీనర్ రవిందర్ రెడ్డి, పిఏ సిఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, జిల్లా రైతు బంధు సభ్యుడు బాల ముకుందాం, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ లు ఎల్లా గంగానర్సు, రాజన్న, బోనగిరినారాయణ, సత్తమ్మ గంగారాం, రాజమని గంగాధర్, ఎంపీటీసీ భుపెళ్లి శ్రీనివాస్, రైతు బంధు సమితి నాయకులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.