రెండు వాహనాలు ఢీ ముగ్గురి మృతి ఒకరి పరిస్థితి విషమం

Published: Tuesday July 27, 2021
పరిగి 26 జూలై ప్రజాపాలన ప్రతినిధి : రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టిన ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ దరణి కాటన్ మిల్ దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎదురుగా వెళ్తున్న క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగి పోవడంతో అక్కకడి నుంచి వస్తున్న సాంట్రో కారుపైకి దూసుకెళ్లడంతో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతులు మల్లికార్జున్ రెడ్డి, రాజ లక్ష్మీ, దేవాన్సు రెడ్డిలుగా గుర్తించారు.