హోమియో హాస్పటల్ ను సందర్శించిన కర్ణాటక సిద్దవైద్యనిపుణులు శ్రీ రామాచార్య పండిట్, అబ్దుల్ అ

Published: Monday January 24, 2022

మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సావిత్రి హోమియోపతి ఆయుర్వేద హాస్పిటల్ సందర్శించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య సిద్ధ నిపుణులు శ్రీ రామాచార్య పండిట్, అబ్దుల్ అజీమ్ లు మధిర ఆత్కూర్ బైపాస్ రోడ్ లోని కుందా సావిత్రి సేవాసమితిని సందర్శించడం జరిగింది అని హోమియో హాస్పిటల్ నిర్వాహకులు శ్రీ సంక్రాంతి శ్రీనివాసరావు, హోమియో, సంప్రదాయ ఆయుర్వేదిక్ వైద్యులు శ్రీ చావా భానుప్రసాద్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా సిద్ద వైద్యులు రామాచార్య పండిట్ మాట్లాడుతూ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో హోమియో హాస్పిటల్ నిర్వహించడంపై సంతోషాన్ని వ్యక్తపరుస్తూ హాస్పిటల్ నిర్మాణం చేసిన కుందా కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలోఆయుర్వేద వైద్యానికి ఉపకరించే మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు సిద్ధావైద్యులు అబ్దుల్ అజీమ్, హోమియో సంప్రదాయ ఆయుర్వేదిక్ వైద్యులు చావా భాను ప్రసాద్, హోమియో హాస్పిటల్ సిబ్బంది బొగ్గవరపు హరీష్, కుటుంబ రావు, అంచె హరీష్, మేడేపల్లి శ్రీనివాసరావు, ఖాసీం, కస్తూరి త్రివేణి, తాళ్లూరి రిషిత తదితరులు పాల్గొన్నారు.