ప్రేంసాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిజెపి,సీపీఐ నాయకులు.

Published: Monday October 11, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్10, ప్రజాపాలన : మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సమక్షంలో పలువురు బిజెపి, సీపీఐ పార్టీ లకు చెందిన నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ కి 3వ వార్డు కృష్ణ కాలనీకి చెందిన సీపీఐ మండల కార్యదర్శి రాగిడి రాజు, 19వ వార్డు తీగల్ పహడ్ చెందిన బిజెపి నాయకులు కామెర క్రాంతి కుమార్ లు ఆ పార్టీ ని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరగా ప్రేంసాగర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు వార్డులలో కలిపి మొత్తం 450 మంది తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు  మాజీ ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీ  3వ వార్డు కృష్ణ కాలనీ, 19వ వార్డు తీగల పహడ్ కి చెందిన యువత, మహిళలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో తాము చేస్తున్న సామాజిక సేవలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా మంచిర్యాల నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రేమ్ సాగర్ రావు  ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,నస్పూర్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బండరి సుధాకర్, మండల అధ్యక్షురాలు అడెపు శ్యామల, కౌన్సిలర్లు శ్రీపతి సుమతి -మల్లేష్, బొడ్డున సంధ్యారాణి-రామ్మూర్తి, తెనుగు లావణ్య, దేవేందర్, గెల్లు రజిత- మల్లేష్. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు ఖాలీద్, మహేష్, అంజయ్య, తిరుపతి, నరేశ్, అరుణ్, సతీష్, కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.