బెల్లంపల్లిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Published: Thursday June 03, 2021

బెల్లంపల్లి జూన్ 2 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూలమాలలు వేసి బెల్లం మున్సిపల్ కార్యాలయంలో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం, మరియు క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సుదీర్ఘ కాలంగా పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దారని, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి బీమా గౌడ్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస మరియు టీబీజీకేఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.