ఈ నెల 27 న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Published: Monday November 21, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 20, ప్రజాపాలన: మంచిర్యాల డిగ్రీ కళాశాల 1975 - 1990 సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈనెల 27వ తేదీన ఏర్పాటు చేయనున్నట్లు మాజి ఎమ్మెల్సీ కోక్కిరాల ప్రేమ్ సాగర్  రావు తెలిపారు.  ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను ఒకే చోట సమ్మేళనం చేయాలనే సంకల్పంలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన గోదావరి రోడ్ లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొనసాగుతుందని చెప్పారు. ఈ సమ్మేళనానికి రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో నే కాకుండా విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.   విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులు తో పాటు కళాశాలలో విద్యాభ్యాసం చేసి రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఎమ్మెల్యేలుగా పని చేసిన వారికి సన్మాన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ అపూర్వ సమ్మేళనంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.  పూర్వ విద్యార్థులు ఇచ్చే విరాళాలు పూర్తిగా కళాశాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సభ్యులు సుల్తాన్ ,అహ్మద్, రవికుమార్ ,హేమ చందర్ , అనిల్ కుమార్ ,సుధాకర్ రెడ్డి, అనిల్ కుమార్, ఎజాజ్ అహ్మద్, విజయ్ కుమార్ సోని, యుగేందర్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.