ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు

Published: Wednesday April 06, 2022
వికారాబాద్ బ్యూరో 04 ఏప్రిల్ ప్రజాపాలన : బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి బాల్ రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన గొప్ప యోధుడు బాబు జగ్జివన్ రామ్ అని కొనియాడారు. ఎంపిగా కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకై పోరాడిన సంఘ భారతదేశ దళిత తొలి ఉప ప్రధాని భారత స్వాతంత్ర పోరాటంలో తమదైన పాత్ర పోషించి, సమాజ సమానత్వాన్నికై పాటుపడిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టి వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మామిడి సంగమేశ్వర్, జిల్లా మహిళా కన్వీనర్ పి.సుధారాణి, వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ఉప్పరి ప్రసాద్, వికారాబాద్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మర్పర్లి మండల అధ్యక్షుడు మురళీదర్ రెడ్డి వసంత్ కుమార్ రమేష్ నాగరాజు పార్టి నాయకులు పాల్గొన్నారు.