గోపన్ పల్లి లో అభివృద్ధి పనుల తనిఖీ నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్

Published: Tuesday February 15, 2022
శేరిలింగంపల్లి- ప్రజాపాలన /న్యూస్ శేరిలింగంపల్లి- నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపన్ పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డులు పనులను, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డులు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ ఆదేశించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గోపన్ పల్లి వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొత్త సీసీ రోడ్డులు పనులను అధికారులతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మన్నే రమేష్, రంగస్వామి, మురగ, చిన్న, మధు, విష్ణు, శ్రీకాంత్, సత్యనారాయణ, సాయి, సతీష్, భీమాజీ, రాజు, సుబ్బా రావు, గోపన్ పల్లి కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు