వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన సీఎల్పీ నేత

Published: Tuesday July 12, 2022
బోనకల్, జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలో  ఆళ్ళ పాడు గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో వీరస్వామి అనే  రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసినదే. వారి చిత్రపటానికి కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాలి దుర్గారావు, ఆళ్ళ పాడు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుంగ రాములు, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, గీత కార్మిక సంఘం ప్రెసిడెంట్ కందుల సత్యం, మంద రామారావు, మరీదు నాగభూషణం, బీసీ సెల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల పాపారావు, యూత్ నాయకుడు నర్సింగ్ ల నరేష్, మందా సైదులు ,మరీదు ప్రసాద్ , గ్రామ శాఖ ఎస్సీసెల్ అధ్యక్షుడు వేల్పుల రమేష్, మరీదు తిరపతి రావు, తోట వెంకన్న ,మంద నరసింహారావు, మరీదు రామకృష్ణ, మరీదు నాగభూషణం, మరీదు గురుమూర్తి ,మరీదు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.