మంచినీటి లైన్లను రోడ్లను త్వరితి గతిన పూర్తి చేస్తా నని స్థానికులకు మాట ఇచ్చిన కొండాపూర్ కా

Published: Wednesday February 09, 2022
శేరిలింగంపల్లి ప్రజాపాలన న్యూస్ : కొండాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ దర్గా కాలనీ మరియు పాన్ మక్తా జెఅర్ సి కన్వెన్షన్ పక్కన ఉన్న స్మశాన వాటిక పరిసరాలలో స్థానిక ప్రజలు, నాయకులతో కలసి కొండాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారు పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు, ప్రజలు కలసి గతంలో తెలిపిన సమస్యలు సత్వరమే పరిష్కరించినందుకుగాను కార్పొరేటర్ హమీద్ పటేల్ ని సత్కరించారు. తదనంతరం స్థానికంగా ఉన్న స్మశాన వాటికలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. పాన్ మక్తా, సాయి నగర్ దర్గాలలో ఉన్న రెండు స్మశాన వాటికలలో అభివృద్ధి పనులను చేపట్టి, మెరుగైన వసతులను కల్పించి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోనికి తీసుకోనివస్తామని హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల మిగిలి ఉన్న మంజీరా మంచి నీటి లైన్లు, రోడ్లను కూడా పూర్తి చేస్తామని స్థానిక ప్రజలకు, నాయకులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా నేమూరి రాములు గౌడ్, మూల అంజి బాబు గౌడ్, చెట్టి సుదర్శన్ గౌడ్, నేమూరి సురేష్ గౌడ్, నక్క నరేందర్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.