కమ్యూనిటీ హాల్ గణేష్ మండపం ప్రారంభోత్సవం

Published: Monday April 19, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల శ్రీసాయి రెసిడెన్షి కాలనీలో కమ్యూనిటీ హాల్ మరియు గణేష్ మండపాన్ని డిప్యూటి మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కోఆప్షన్ సభ్యులు రంగా బ్రమ్మన్నతో కలిసి స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్, గణేష్ మండపాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. డివిజన్లోని ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి కృషి చేశానని కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివ శంకర్, కొత్త రవి గౌడ్, కాలనీ గౌరవ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, కాలనీ అధ్యక్షులు మంద రామకృష్ణ రెడ్డి, ప్ర్రధాన కార్యదర్శి ఎం.మల్లారెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.