ఇంటింటికీ మొక్కలు పంపిణీ

Published: Thursday July 08, 2021
మధిర, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీపట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు 18వ వార్డు కౌన్సిలర్ అరిగే రజిని కుమారి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డు లోని ప్రజలకు ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగే కార్యదర్శి శ్రీనివాసరావు వినాయకుడి గుడి చైర్మన్ మిర్యాల సీతారామయ్య వార్డు ఇంచార్జ్ ఆర్పి లు ఆశా వర్కర్లు వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు