పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది ** అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ **

Published: Thursday February 16, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 15 ప్రజాపాలన,ప్రతినిధి) : 
పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుందని ప్రభుత్వ అధికారులకు బదిలీలు సహజమని ఆసిఫాబాద్ అటవీ రేంజ్ అధికారి అప్పల కొండ అన్నారు. బుధవారం అసిఫాబాద్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ బీట్ అధికారులుగా విధులు నిర్వహించి పదోన్నతి పై ములుగు జిల్లాకు బదిలీ అయి వెళ్తున్న శంకర్, యాదవరావు, ఇంతియాజ్ హుస్సేన్ లను తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగంలో పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుందన్నారు. అటవీ బీట్ అధికారులుగా చేసిన సేవలు ఎంతో గొప్పగా కొనసాగాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. రేంజ్ నుండి ముగ్గురికి అటవీ సెక్షన్ అధికారులుగా పదోన్నతి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ  కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ప్రవీణ్ కుమార్, సరోజరాణి, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.