మతిస్థిమితం కోల్పోయి నిస్సహయస్థితిలో వున్న వ్యక్తికి మాతృదేవోభవ ఆశ్రమ చేరదీత

Published: Monday July 19, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో ఉన్నటువంటి నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి ఆశ్రమం సిబ్బందితో పాటు కలిసి మతిస్థిమితం కోల్పోయి బాలాపూర్ ప్రాంత పరిధిలో రోడ్డు పై మాసిన బట్టలతో పడవేసిన వ్యర్ధాలను తింటూ తిరుగుతునటువంటి వ్యక్తిని (పేరు రాము, వయస్సు 45సంలు) చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మాట్లాడుతూ.... మతిస్థిమితంలేని వ్యక్తిని త్వరలోనే ఇతనికి మంచి పౌష్టికాహారం, వైద్యన్ని అందించి మాములు స్థితికి తీసుకువచ్చి అతని కుటుంబ సభ్యుల వివరాలను కనుగొని వారి చెంతకు చేర్చుతమని తెలియజేశారు. ఈ వ్యక్తి ని ఎవరైనా గుర్తుపడితే మాతృదేవోభవ అనాధ ఆశ్రమం సెల్ నెం.(9347513830) ను సంప్రదించాలని కోరారు.