లారీని ఢీకొన్న మధిర డిపో బస్సు

Published: Monday February 07, 2022
మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : నకిరేకల్ బైపాస్ వద్ద ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన బస్సు బైపాస్ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 50మంది వరకు బస్సులో ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ బస్సు మార్జిన్ దాటి రోడ్డు పైకి రావడంతో ఢీ కొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రమాదానికి గురైన బస్సు లోనే ప్రయాణికులను వేరే బస్సు లో తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేస్తున్నారు. ప్రమాదానికి కి కారణమైన లారీ బస్సు ని నకిరేకల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. బస్సు ప్రమాదంలో స్వల్ప గాయాలైన ప్రయాణికులను 108లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.