మోటారు సైకిల్ వాహన మెకానిక్ చార్జీలు పెరుగుదల

Published: Tuesday May 31, 2022
మండల మోటారు సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలిన మదు
 
జన్నారం రూరల్, మే 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల మెాటారు సైకిల్ వాహన వినియోగదారులకు మెకానిక్ చార్జీలు పెంచడం జరిగిందని మండల మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలిన మదు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సామాన్య ప్రజలపై పెంచిన నిత్యావసర వస్తువుల దరలు జీఎస్టీ కలుపుకొని వాటికి అనుగుణంగా మెకానిక్ చార్జీలు పెంచడం జరిగిందని ఇట్టి విషయాన్ని మెాటారు సైకిల్ వాహన  వినియోగదారులు అర్దం చేసుకొని సహకరించగలరని అయన కోరారు, ఈ సమావేశంలో జన్నారం మండల మెాటారు సైకిల్ అసోసియేషన్ అద్యక్షులు బాలిన మధు, జన్నారం మండల టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.