ప్రతి డివిజన్లో కంటి వెలుగు క్యాంపు ఏర్పాటు చేస్తాం

Published: Saturday February 04, 2023
మేయర్ సామల బుచ్చిరెడ్డి
మేడిపల్లి, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కంటి వెలుగు క్యాంపును ఏర్పాటు చేస్తామని మేయర్ సామల బుచ్చిరెడ్డి తెలిపారు. కార్పొరేషన్లోని

2వ డివిజన్ ఇందిరా నగర్  కాలనీ కమ్యూనిటీ హాల్లో మేయర్ సామల బుచ్చిరెడ్డి 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు కొత్త

చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సామల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ  ప్రతి డివిజన్లో కంటి వెలుగు క్యాంపు ఏర్పాటు అవుతుందని, 100 రోజుల ఈ కార్యక్రమాన్ని ఒక్కో డివిజన్లో సుమారు వారం రోజుల పాటు క్యాంపు నిర్వహిస్తున్నందున ప్రజలు కంగారు పడకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్ మరియు మెడికల్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.