ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *మత్స్యకారులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభు

Published: Tuesday November 29, 2022
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృ మత్స్యఅభివృద్ధి పథకాలలో భాగంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని 8లక్షల 50వేల చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి .
ఎమ్మెల్యే  మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి మత్స్యకారులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా ఏకైక ప్రభుత్వం దేశంలోనే మనదని అన్నారు.
కార్యక్రమంలో ఎంపిపి కృపేష్, చైర్ పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిశరీస్ డిపార్ట్మెంట్ నుకీర్తి, గంగపుత్ర, ముదిరాజ్ సంఘ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.